Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలోఫర్ ఆస్పత్రిలో వింత శిశువు.. జన్యుపరమైన లోపంతో..?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:30 IST)
హైదరాబాద్‌‌లో ఇటీవల చేప ఆకారంలో శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. హైకోర్టు సమీపంలోని పేట్ల బురుజు ఆస్పత్రిలో అచ్చం చేపలా శరీరం ఉన్న బిడ్డ పుట్టింది. కానీ ఈ శిశువు కూడా రెండు గంటలకే మృతి చెందింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో వింత శిశువు జన్మించింది. హైదరాబాద్ కాప్రాకి చెందిన సరళ, విజయ్ కుమార్ దంపతులకు ఈ శిశువు జన్మించింది. 
 
హెర్లేక్వీన్ ఇచియోసీస్ అనే జన్యుపరమైన లోపంతో ఈ శిశువు జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలోని రెండవ అంతస్తులో చికిత్స పొందుతున్న ఈ శిశువు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. గతంలోనూ సరళ నిలోఫర్‌లోనే వింత శిశువుకు జన్మించినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. జన్యులోపం కారణంగా చర్మం పగిలిపోయి, రక్తపు చారలతో ఆ శిశువు జన్మించింది. సదరు మహిళకు గతంలో జన్మించిన బిడ్డ కూడా ఇదే జన్యులోపంతో జన్మించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.., మేడ్చల్‌ జిల్లా, కాప్రా ప్రాంతానికి చెందిన సరళ, విజయ్‌ కుమార్‌ దంపతులకు మొదట ఒక బిడ్డ జన్మించి జన్యు లోపంతో మరణించింది. ఆ సమయంలో వారికి జన్యు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కాని, సదరు దంపతులు జన్యు పరీక్షలు చేయించుకోకుండానే రెండో గర్భానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో శనివారం సరళ రెండోసారి నిలోఫర్‌ హాస్పిటల్‌లో ప్రసవించింది.
 
ఈ కాన్పులో రక్తపు చారలతో 'హర్లిక్విన్‌ ఇథియోసిస్‌’ సిండ్రోమ్‌తో శిశువు జన్మించింది. శిశువు జన్మించిన వెంటనే శరీరంపై చర్మం పగిలిపోయి రక్తం, మాంసం బయటకు తేలడం, రక్తపు చారలు కనిపించాయి. దీంతో వెంటనే శిశువును తదుపరి చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments