Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోషియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ - నలుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:06 IST)
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 
 
ప్రస్తుతం జవాన్లు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.
 
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు.
 
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. 
 
వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments