Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోషియాన్ జిల్లాలో ఎన్‌కౌంటర్ - నలుగురు ఉగ్రవాదుల హతం

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:06 IST)
భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య కాల్పులు కలకలం రేపాయి. భద్రత దళాలు చేపట్టిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 
 
ప్రస్తుతం జవాన్లు - ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉన్న పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ దళాలు సమన్వయంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం రెండు గంటలకు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది.
 
మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందుకున్న సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు.
 
భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. కాల్పులు ఆగిన తర్వాత ఘటనా స్థలంలో చూడగా నలుగురు ఉగ్రవాదులు హతమై కనిపించారు. 
 
వీరంతా లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

ఏ వైలెంట్ టేల్ అఫ్ బ్లడ్ షెడ్: హనీ రోజ్ రేచెల్ రాబోతుంది

పూరీ జగన్నాథ్ గతిని రామ్ పోతినేని మార్చనున్నాడా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? (Video)

కుర్రకారుని కైపుగా వెక్కిరిస్తున్న రష్మిక మందన్నా

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments