పెళ్లై నెల రోజులే.. ఇంతలో భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (23:23 IST)
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్ మండిలో కాలేరు సతీష్ (33) తన భార్య, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా సతీష్‌కు 10 నెలల క్రిత్రమే వివాహం జరిగింది.
 
ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అయితే.. గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవ పడ్డ సతీష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఘటనా స్థలాన్ని చిలకలగూడ ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్ఐ శ్రీనివాస్ పరిశీలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments