Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందును పైనుంచి కిందపడేశారు.. వాళ్లు తల్లిదండ్రులేనా?

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:03 IST)
Newborn
సభ్య సమాజం తలదించుకునేలా తల్లిదండ్రులు ప్రవర్తించారు. తల్లిదండ్రులు అనే పేరుకు మాయని మచ్చతెచ్చేలా నడుచుకున్నారు. తాజాగా అలాంటి అమానుష ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కుషాయిగూడలో అప్పుడే పుట్టిన పాపను అపార్ట్‌మెంట్‌పై నుంచి గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ పాపను చేరదీసి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 
పై నుంచి కిందకి పడివేయడంతో ఆ శిశువు తలకు సిమెంట్ కాంక్రీట్ గుచ్చుకున్నాయి. పసికందును గాయలతో ఉన్న స్థితిలో చూసిన కుషాయిగూడ ఎస్సై సాయికుమార్ చలించిపోయారు. 
 
పాపను తనచేతుల్లోకి తీసుకుని వెంటనే వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 318 (మృతదేహాన్ని రహస్యంగా పారవేయడం ద్వారా పుట్టుకను దాచడం) కింద కేసు నమోదు చేయబడినప్పటికీ, శిశువును విడిచిపెట్టిన తల్లిదండ్రులు లేదా వ్యక్తుల గురించి పోలీసులకు ఇంకా తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments