Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ అస్థికలను తెప్పించాలి.. వందరూపాయల నోటుపై బొమ్మ వేయాలి: పవన్

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (12:35 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతాజీ కోసం కొత్తతరం కదలాలని పిలుపు నిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను గౌరవించకుంటే మనం భారతీయులమే కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజి ఆలయంలో దిక్కులేకుండా పడి ఉన్నాయని, వాటిని భారతదేశానికి తీసుకురావాలని కోరారు. 
 
ఆ అస్థికలు నేతాజీవి అవునా.. కాదా.. అని  డీఎన్ఏ పరీక్షలు చేసి తేల్చలేమా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు మూడు సార్లు ఆస్థికలు తేవడానికి ప్రయత్నించినా కుదరలేదన్నారు పవన్ కల్యాణ్. వంద రూపాయల నోట్‌పై నేతాజీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది బలిదానాల వల్లే ఈరోజు దేశంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని చెప్పారు. 
 
దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం వల్లే తనకు జీవితం అంటే ఏంటో తెలిసిందన్నారు. సినిమా ఉచితంగా చేస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వనని చెప్పారు. అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవని తెలిపారు. త్రివిక్రమ్  వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తానన్నారు పవన్ కళ్యాణ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments