Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాయిని కుటుంబంలో మరో విషాదం.. సతీమణి కూడా కన్నుమూత

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (08:52 IST)
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, తెరాస సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సతీమణి అహల్య కూడా కన్నుమూసింది. ఆమె వయసు 68 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె... ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఈ వైరస్ నుంచి ఆమె ఇటీవలే కోలుకున్నట్టు కనిపించారు. ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కూడా కరోనా నెగెటివ్ అని వచ్చింది. 
 
అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. హైదరాబాదు, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. నాయిని మృతి సమయంలో ఆఖరి చూపు చూసేందుకు కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్సులో తీసుకెళ్లారు. భర్త చనిపోయిన ఐదు రోజుల్లోనే భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో నాయిని కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments