Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు నష్టం.. టెక్కీ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:23 IST)
సాంకేతికత పెరగడం ఒకందుకు మంచిదే. కానీ చాలా మేరకు నష్టాలు తప్పట్లేదు. మానవునికి పెరిగిన టెక్నాలజీ కష్టాల్నే తెచ్చిపెడుతున్నాయి. అంతేగాదు.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. త్వరగా డబ్బులు సంపాదించాలనే అత్యుత్సాహంతో చదువుకున్న వారు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. 
 
దీని వల్ల అప్పులు పాలై.. పరువును నడి బజారుకు లాక్కుంటున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యే శరణ్యమని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 
 
తాజాగా క్రికెట్‌లో బెట్టింగ్ కట్టి.. 40 లక్షలు నష్టపోయి.. చివరకు రైలు పట్టాలపై తనువు చాలించాడు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గంగి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అప్పు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు. 
 
దీంతో అప్పులు ఇచ్చిన వారు అడగటం మొదలు పెట్టేసరికి.. ఏం చేయాలో తోచక.. భార్యను, పసి బిడ్డను వదిలేసి.. జిల్లాలోని సాతలూరు రైలు పట్టాలపై ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments