క్రికెట్ బెట్టింగ్.. రూ.40 లక్షలు నష్టం.. టెక్కీ ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (19:23 IST)
సాంకేతికత పెరగడం ఒకందుకు మంచిదే. కానీ చాలా మేరకు నష్టాలు తప్పట్లేదు. మానవునికి పెరిగిన టెక్నాలజీ కష్టాల్నే తెచ్చిపెడుతున్నాయి. అంతేగాదు.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. త్వరగా డబ్బులు సంపాదించాలనే అత్యుత్సాహంతో చదువుకున్న వారు కూడా చేతులు కాల్చుకుంటున్నారు. 
 
దీని వల్ల అప్పులు పాలై.. పరువును నడి బజారుకు లాక్కుంటున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యే శరణ్యమని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. 
 
తాజాగా క్రికెట్‌లో బెట్టింగ్ కట్టి.. 40 లక్షలు నష్టపోయి.. చివరకు రైలు పట్టాలపై తనువు చాలించాడు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గంగి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అప్పు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు. 
 
దీంతో అప్పులు ఇచ్చిన వారు అడగటం మొదలు పెట్టేసరికి.. ఏం చేయాలో తోచక.. భార్యను, పసి బిడ్డను వదిలేసి.. జిల్లాలోని సాతలూరు రైలు పట్టాలపై ఆత్మహత్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments