Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపై దాడి.. చంచల్‌గూడ జైలుకు వైఎస్ షర్మిల.. 14 రోజుల రిమాండ్

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:36 IST)
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం పోలీసులపై చేయి చేసుకున్న ఘటనలో ఆమెపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నాంపల్లి కోర్టుకు తరలించారు. మరోవైపు, షర్మిళ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దర్యాప్తుపై సిట్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని షర్మిళ నిర్ణయించుకున్నారు. లోటస్ పాండ్‌లోని తన ఇంటి నుంచి ఆమె సోమవారం మధ్యాహ్నం సిట్ ఆఫీసుకు బయలుదేరారు. ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత షర్మిళను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
అదేసమయంలో షర్మిళ వ్యవహారశైలిపై పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా షర్మిళ, ఏ2గా డ్రైవర్ బాబు, ఏ3గా యాకబ్‌లను పోలీసులు చేర్చారు. అయితే, షర్మిళ, బాబులను పోలీసులు అరెస్టు చేయగా, యాకబ్ మాత్రం పరారీలో ఉన్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments