Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై ఒత్తిడి.. పురుగుల మందు తాగి...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (16:45 IST)
గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై భర్త చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని దిండి మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగయ్యకు 8 నెలల క్రితం రాధ (22) అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, అత్తమామలు బైకును తీసివ్వాల్సివుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ బైకును కొనివ్వలేక పోయారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు కేటాయించారు. దీంతో తన భార్యను పోటీ చేయించాలని లింగయ్య భావించారు. 
 
ఇందుకోసం రూ.5 లక్షల డబ్బును పుట్టింటికెళ్లి తీసుకుని రావాలంటూ భార్య రాధను వేధించాడు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకుంది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments