Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై ఒత్తిడి.. పురుగుల మందు తాగి...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (16:45 IST)
గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలని భార్యపై భర్త చేసిన ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని దిండి మండలంలోని ఎర్రగుంటపల్లికి చెందిన జంతుక లింగయ్యకు 8 నెలల క్రితం రాధ (22) అనే యువతితో వివాహం జరిగింది.
 
వివాహం సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు, అత్తమామలు బైకును తీసివ్వాల్సివుంది. కానీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ బైకును కొనివ్వలేక పోయారు. ఈ క్రమంలో ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు కేటాయించారు. దీంతో తన భార్యను పోటీ చేయించాలని లింగయ్య భావించారు. 
 
ఇందుకోసం రూ.5 లక్షల డబ్బును పుట్టింటికెళ్లి తీసుకుని రావాలంటూ భార్య రాధను వేధించాడు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లి తన తల్లిదండ్రులకు తన గోడును వెళ్లబోసుకుంది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో రాధ ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments