Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట నిలబెట్టుకోలేకపోయాను.. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్తున్నా...

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (11:32 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మాట నిలబెట్టుకోలేక పోయానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎంసెట్‌ పరీక్షలను నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని శాబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన స్నేహా (16) అనే విద్యార్థిని కూడా రాసింది. అయితే, ఈ ఫలితాల్లో ఆమె అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 
 
'అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొహం చూపించలేను. మీరు నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని వదలి వెళ్తున్నా' అంటూ సూసైడ్ నోట్ రాసింది. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments