Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న చనిపోయింది కరోనాతో కాదు, సున్నం రాజయ్య తనయుడు వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (20:43 IST)
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సీపీఎం సీనియర్ నేత సున్నం రాజయ్య కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. అయితే ఆయన కుమారుడు విడుదల చేసిన  ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరుపెట్టారని తెలిపారు.
 
కరోనా సోకిన తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత మా అక్కకు కరోనా సోకింది. దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడటం, ఆయన వస్తున్నపుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు. దీంతో ఆయన మానసికంగా కృంగిపోయారని, తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని దీంతో ఆయన విపరీతమైన ఒత్తిడికి గురయ్యారని తెలిపారు.
 
ఎన్నో ప్రమాదాలను, రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్కకాదని తెలిపారు. ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం చేయడం తట్టుకోలేకపోయారన్నారు. ప్రజలు పలకరించి ధైర్యం చెప్పి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జనాల్లో సరైన అవగాహన కల్పించలేదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments