ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం ... 3 పోలింగ్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (18:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలను ఈ నెల 6వ తేదీన వెల్లడిస్తారు. 
 
మంగళవారం సరిగ్గా 6 గంటలు కాగానే మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని అనుమతించరు. ఈ కీలక ఘట్టం ముగియడంతో అన్ని పార్టీల నేతలు గళం మూగబోయింది. 
 
ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments