Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన మునుగోడు ఎన్నికల ప్రచారం ... 3 పోలింగ్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (18:50 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఈ నెల 3వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. జరుగనుంది. ఇందుకోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఫలితాలను ఈ నెల 6వ తేదీన వెల్లడిస్తారు. 
 
మంగళవారం సరిగ్గా 6 గంటలు కాగానే మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ ఏ పార్టీకి చెందిన ప్రచారాన్ని అనుమతించరు. ఈ కీలక ఘట్టం ముగియడంతో అన్ని పార్టీల నేతలు గళం మూగబోయింది. 
 
ఇకపోతే ఈ ఉప ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ ఈ నెల 3వ తేదీన గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకు జరుగనుంది. ఈ పోలింగ్ కోసం ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిసి మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన విషయం తెల్సిందే. వీరి భవితవ్యాన్ని మునుగోడు ఓటర్లు గురువారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments