Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (12:47 IST)
అత్తింటి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య (37), జ్యోతి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. అయితే వెంకటయ్య ఆర్థికపరిస్థితి బాగాలేదని జ్యోతి గొడవపడేది. ఇదే విషయంపై దంపతులిద్దరికీ ఈ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి వెంకటయ్యను కొట్టించింది. 
 
అనంతరం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడం, బావమరుదులు కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య తన పొలం దగ్గర ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు బావమరుదులు కొట్టడం మరియు భార్య వెళ్లిపోవడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెంకటయ్య తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments