Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనకు న్యాయం చేయాలని కూతురితో కలిసి తల్లి భిక్షాటన

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (18:02 IST)
తనకు జరిగన అన్యాయాన్ని నిరసిస్తూ ఓ తల్లి తన కన్న కూతురితో కలిసి భిక్షాటన చేసింది. ఆర్మీ ఉద్యోగం చేస్తూ భర్త పట్టించుకోకపోగా తన పేరిట ఉన్న భూమిని అత్త, బావలు అక్రమంగా పట్టా చేసుకున్నారు. అది సహించలేని ఆ మహిళ ఏంచేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిల్లో భిక్షాటన చేస్తూ నిరసన చేసింది.
 
ఆ తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తన కూతురితో ధర్నా చేసింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లెలో చోటుచేసుకున్నది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 15 ఏళ్ల క్రితం తీగరాజు పల్లె గ్రామానికి చెందిన రంరాజు అమరావతికి, మదుసూదన్‌కు వివాహం జరిగింది.
 
అయితే సదరు మహిళ తన భర్త, బావ, ఆడబిడ్డలపై కుటుంబ కలహాలతో 2012లో హన్మకొండలోని మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడి పోలీసులు వారందరి పైనా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేసు నడుస్తూనే ఉంది. ఓవైపు తను పెట్టిన కేసులు విచారణలో ఉండగానే అత్త, బావ రంగరాజ్ సదరు బాధితురాలు పేరు మీద ఉన్న భూమిని వారి పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
 
తర్వాత కొన్ని రోజులకే ఈ విషయం అమరావతికి తెలియడంతో వెంటనే ఆమె స్పందించి తనకు న్యాయం చేయాలంటూ తన కూతురితో కలిసి గ్రామంలో భిక్షాటన చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments