Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు ప్రేయసిని ఇంటికి పిలిపించి.. చితక్కొట్టిన తల్లి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:03 IST)
తన కొడుకుతో పెళ్లి చేస్తానని చెప్పి ఓ తల్లి కొడుకు ప్రేయసిని ఇంటికి పిలిచి దాడి చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్‌కు చెందిన భరత్ చంద్ర 26 మోతీ బజార్‌కు చెందిన శ్రావణి 21 నాలుగేళ్ల ప్రేమించుకున్నారు. 
 
భరత్ చంద్రకు ఇటీవలే తల్లిదండ్రులు వివాహం చేసేందుకు సంబంధం చూశారు. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఈ నెల 27న వివాహం నిశ్చయించారు. దాంతో ఈ నెల 9న బరత్ చంద్ర తన ప్రియురాలి తో కలిసి ఇంటి నుండి పారిపోయాడు.
 
కాగా భారత్ చంద్ర తల్లి అతనికి ఫోన్ చేసి ప్రేమించిన యువతి తోనే పెళ్లి చేస్తానని ఇంటికి రావాలని కోరింది. దాంతో తల్లిని నమ్మి భరత్ చంద్ర ప్రియురాలితో కలిసి ఇంటికి వచ్చాడు. నిన్న రాత్రి భరత్ చంద్ర తల్లి శ్రావణితో వాగ్వాదానికి దిగింది. అంతే కాకుండా శ్రావణిపై ఇనుప రాడ్డుతో తీవ్రంగా దాడి చేసింది. 
 
దాంతో గాయాలతో శ్రావణి బయటకు వచ్చింది. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments