Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇనుప కంచెపై కరెంట్ తీగలు.. పట్టుకున్న తల్లి మృతి.. రక్షించబోయిన కూతురు కూడా?

కరెంట్ తీగలు తగిలి తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని నారాయణపేట మండలం జాజపూర్‌లో కరెంట్ తీగలు తల్లీకుమార

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (17:08 IST)
కరెంట్ తీగలు తగిలి తల్లీకూతురు దుర్మరణం పాలైన ఘటన తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని నారాయణపేట మండలం జాజపూర్‌లో కరెంట్ తీగలు తల్లీకుమార్తెలను బలితీసుకున్నాయి. ఇంటికి రక్షణగా వుంటాయని ప్రహరీగా వీరు ఇనుప కంచెను నిర్మించుకున్నారు. కానీ గాలికి విద్యుత్ తీగలు తెగి ఈ కంచెపై పడ్డాయి.
 
ఆపై ఇనుప కంచెకు విద్యుత్ సరఫరా అయింది. ఇది తెలుసుకోని మహిళ పని చేసుకుంటూ కంచెను ముట్టుకుని విద్యుద్ఘాతానికి గురైంది. దీన్ని గమనించిన ఆమె కూతురు తల్లిని రక్షించబోయి కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments