Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కూల్ రూఫ్ గృహాలు... మంత్రి కేటీఆర్

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (16:31 IST)
పర్యావరణ మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక పోతున్నారు. ఈ ఎండల వేడిమి నుంచి తప్పించుకునేందుకు కూల్ రూఫ్ టాప్‌ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మన నంగరం అనే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో గృహాలు, ఆఫీసులు, వాణిజ్య భవనాలలో కరెంట్ వాడకం పెరిగిపోతుందని చెప్పారు. దీంతో కరెంట్ బిల్లు భారీగా వస్తుందని వివరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కూల్ రూఫ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ విధానం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
కూల్ రూఫ్ వల్ల మీటర్‌కు కేవలం రూ.300 మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. దీనివల్ల కరెంట్ వాడకం తగ్గి ఆ మెరకు బిల్లు కూడా తగ్గుతుందని చెప్పారు. కూల్ రూఫ్‌కు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని ఆయన వివరించారు. కూల్ రూఫ్ కోసం ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరపున ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments