Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరో వచ్చి.. తెలంగాణ రైతులకు అన్యాయం జరిగిందని అరుస్తున్నారు.. మంత్రి హరీష్

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (16:48 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొత్త పార్టీని పెట్టనున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావించకుండానే సుతిమెత్తగా విమర్శలు గుప్పించారు. 

సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం రైతు వేదికను ప్రారంభించిన హరీష్ రావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ఆయన కామెంట్స్ చేశారు. 

'ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు' అంటూ పరోక్షంగా షర్మిలకు హరీష్ రావు చురకలంటించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. 

ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.

కాగా, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లో తన మద్దతుదారులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన విషయం తెల్సిందే. పైగా, తనకు, అన్న జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జటాధర లో శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌ చేసింది : నిర్మాత ప్రేరణ అరోరా

Sudeep: కిచ్చా సుదీప్ పాన్ ఇండియా మూవీ మార్క్ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో నిశాంచి ట్రైలర్ విడుదల

Anupama : దెయ్యంలా వుంటావని అమ్మ తిడుతుండేది : అనుపమ పరమేశ్వరన్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments