Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల గుండెల్లో బీజేపి రెండు బాంబులు: మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:57 IST)
బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు.
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మొక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. అలాగే బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు.
 
వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పోరేటీకరణకు తెరలేపి నయా జమిందారీ వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎప్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments