Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ కోసం హోరు వానలో మెట్రో రైలు నడిపారు, ఏం జరిగింది?

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (17:15 IST)
సమయం రాత్రి 9.30 గంటలు కావస్తోంది. ఓ ప్రక్క హోరున వాన కురుస్తోంది. అది హైదరాబాదులోని వీఆర్ కొత్తపేటలోని మెట్రో స్టేషన్. ఓ గర్భిణీ ఆ రాత్రి సమయంలో అక్కడికి వచ్చింది. తాను మియాపూర్ వెళ్లాలని, కానీ తను వెళ్లడానికి బస్సులు, ఆటోలు అందుబాటులో లేవని అక్కడి సిబ్బందికి తెలిపింది.
 
కోవిడ్ నిబంధనలతో మెట్రో రైళ్లు ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తిరుగుతున్నాయి. ఆమె అక్కడికి వచ్చే సమయానికి రాత్రి మెట్రో ట్రైన్ వెళ్లిపోయింది. అక్కడి సిబ్బంది కూడా అదే విషయాన్ని ఆమెకు తెలిపారు. దీంతో ఆమె సిబ్బందితో ఏలాగైనా తాను మియాపూర్ వెళ్లాలని దానికి సహాయం చెయ్యాలని ప్రాధేయపడింది. దీంతో అక్కడి సిబ్బంది తమ పైఅధికారులకు విషయాన్ని చేరవేశారు.
 
తమ ప్రయత్నంగా ఆమె పరిస్థితిని తెలిపారు. దీంతో స్పందించిన అధికారులు ఆమె ఒక్కరి కోసమే మెట్రో సర్వీసును సిద్దం చేశారు. ఆమెను మెట్రోలో ఎక్కించుకుని 40 నిమిషాల్లో మియాపూర్ చేర్చారు. ఆమె క్షేమంగా మియాపూర్ చేరడానికి సహకరించారు. ఆ విషయాన్ని మెట్రో భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ ఎమ్‌డీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో నడపాలని నిబంధన ఉందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments