Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ యాక్సిడెంట్ కేసు : సాయిధరమ్ స్పందించడం లేదు.. త్వరలో చార్జిషీట్

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:44 IST)
బైక్ యాక్సిడెంట్ కేసులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్‌కు పంపిన నోటీసులపై స్పందించడం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. 
 
దీనిపై సైబరాబాద్ పోలీసీ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, బైక్ ప్రమాదం కేసులో సాయి ధరమ్‌కు నోటీసులు పంపించగా, ఆయన ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదైవుందని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్యూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ సాయి ధరమ్ మాత్రం స్పందించలేదని చెప్పారు. అయినప్పటికీ త్వరలోనే ఆయనపై చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, గత యేడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలకు సంబంధించి ఆయన ఒక వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో ఈ యేడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మరణిస్తే, వీరిలో 80 శాతం మంది తలకు హెల్మెట్లు ధరించక పోవడంతో చనిపోయారని వివరించారు. 
 
అలాగే, 712 రోడ్డు ప్రమాద కేసుల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 212 ప్రమాదాలు జరిగినట్టు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడిన వాహనచోదకుల నుంచి రూ.4.50 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు చెప్పారు. అలాగే, 9981 వాహనచోదకుల లైసెన్సులు రద్దు చేసినట్టు ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments