Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూర్తిగా కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్... మెగా ఫ్యామిలీ ఫుల్ స్వింగ్!

పూర్తిగా కోలుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్... మెగా ఫ్యామిలీ ఫుల్ స్వింగ్!
విజ‌య‌వాడ‌ , సోమవారం, 8 నవంబరు 2021 (11:06 IST)
మెగా ఫ్యామిలీ, యువ కెర‌టం సాయి ధ‌ర‌మ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. ఈ విష‌యాన్ని మెగా స్టార్ చిరంజీవి తెలియ‌జేశారు. మా కుటుంబ సభ్యుల కు ఇది నిజమైన పండుగ అంటు మెగా స్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి  సాయి ధరమ్ తేజ్  పూర్తిగా కోలుకున్నాడ‌ని పేర్కొన్నారు. 
 
 
గ‌త సెప్టెంబ‌రులో రోడ్డు ప్ర‌మాదంలో స్పోర్ట్ బైక్ పై నుంచి కింద ప‌డి సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అపోలో ఆసుప‌త్రిలో చికిత్స అనంత‌రం ఇంటికి చేరిన తేజ్, ఇపుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా క‌నిపిస్తున్నారు. మెగాస్టార్ చేసిన ట్వీట్ కి తేజ్ రిప్ల‌యి కూడా పెట్టాడు. ఇంత‌టి ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు చిరంజీవికి ధ‌న్య‌వాదాలు కూడా తెలిపాడు తేజ్.
 
 
ఈ దీపావ‌ళికి మెగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి, చేసిన సంద‌డిని చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తో పాటు చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, ప‌వ‌న్ క‌ల్యాణ్, వ‌రుణ్ తేజ్, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, వైష్ణ‌వ్ తేజ్ కూడా ఉన్నారు. బ‌య‌ట ఎన్ని వ‌దంతులు వ్యాప్తి చేసినా, తాము మాత్రం మెగా ఫ్యామిలీ అంతా ఒక‌టేన‌ని వీరంతా నిరూపిస్తున్నారు. రాజకీయాల్లో చేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా అటెండ్ అవుతూ, త‌మ ఐక్య‌త‌ను చాటుతున్నారు. మ‌రో ప‌క్క అల్లు అర‌వింద్ త‌న‌యుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌ను అన్నీ తానై న‌డిపిస్తూ, సంద‌డి చేయ‌డం చూస్తే, ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఔరా, మెగా ఫ్యామిలీ అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు