Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్వరం - దగ్గుకు మాత్రలు కావాలంటే ఇకపై వివరాలు ఇవ్వాల్సిందే.. ఎక్కడ?

Webdunia
శనివారం, 18 ఏప్రియల్ 2020 (17:58 IST)
కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థతుల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇకపై తెలంగాణలో ఫీవర్ సర్వైలెన్స్‌లోనికి మెడికల్ షాపులు రానున్నాయి. మెడికల్ షాపులు ఫీవర్ సర్వైలైన్స్‌లోకి భాగస్వామ్యం చేస్తూ శనివారం మధ్యాహ్నం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటివాటికి మాత్రలు కొనుగోలు చేస్తే వారి వివరాలను సేకరించాలని మెడికల్‌ షాపులకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 
 
అయితే, ఈ వివరాలను సేకరించిన తర్వాత సర్కారు ఏం చేస్తుందన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ వివరాలు ద్వారా జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, వారికి కరోనా పరీక్షలు చేసేందుకే ఈ తరహా నిర్ణయం తీసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే.. మెడికల్ షాపుల్లో టాబ్లెట్స్ కొనేవారికి ఇది ఒకింత షాకింగ్ విషయమేనని చెప్పుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments