మెదక్ జిల్లాల్లో విషాదం : సీఎంకు లేఖ రాసి రైతు ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (14:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాల్లో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను ఆత్మహత్య చేసుకునేముందు ముఖ్యమంత్రికి లేఖ రాసిమరీ చనిపోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లాలోని హవేలి ఘన‌పూర్ మండలంలోని బొగడ భూపతిపూర్ గ్రామంలో ఓ యువరైతు ఉన్నాడు. ఈయన కుమారుడు అనారోగ్యంబారినపడ్డాడు. అతనికి వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు. 
 
పైగా, ఆసరా పెన్షన్‌కు అర్హుడైన తన తండ్రికి పెన్షన్ రావడం లేదు. దీనికితోడు పండించిన వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన ఆ రైతు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments