Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలుగులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం... ఇన్ఫార్మర్లకు వార్నింగ్

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:25 IST)
తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో ఆంధ్రా, ఒరిసా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసుల గస్తీ కూడా పెంచారు. అలాగే భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశాయి.
 
ఈ నేపథ్యంలో మలుగు జిల్లాలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. గురువారం వెంకటాపురం మండలి, కొండాపూర్ - ఆలుబాక గ్రామాల మధ్య మావోల పోస్టర్లు వెలిశాయి. ఇవి వెంకటాపురం - వాజేడు ఏరియా కమిటీ పేరుతో ముద్రించారు. అలాగే, కొన్ని లేఖలను కూడా స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా, పోలీసులకు తమ గురించి సమాచారం అందించే వారిని హెచ్చరిస్తూ ఈ పోస్టర్లను ముద్రించి అంటించారు. 
 
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లను అందులో పేర్కొంటూ, వీరంతా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వారు హెచ్చరించారు. ఈ పోస్టర్లు ఇపుడు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments