Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత కత్తి మోహన్ రావు గుండెపోటుతో మృతి

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (17:16 IST)
మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చిన అగ్రనేత నేత కత్తి మోహన్ రావు అలియాస్ ప్రకాశన్న అలియాస్ దామదాద గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఈ నెల 10వ తేదీన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు పార్టీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మోహనరావు స్వస్ధలం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామం. 39 ఏండ్ల క్రితమే ఆయన అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోహన్‌ రావు చదువులో చురుకైన విద్యార్థిగా ఉన్నారు. ఇంటర్‌ మహబూబాబాద్‌, డిగ్రీ ఖమ్మం, పీజీ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 
 
డబుల్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆయన... అన్న, అక్క, తమ్ముడు, చెల్లె ఉన్నారు. ఉద్యమంలో చేరిన తర్వాత 1985లో ఆయన ఖమ్మంలో అరెస్టు అయ్యారు. ఆరేళ్లు జైలు జీవితం గడిపారు. విడుదలై బయటకు వచ్చిన ఆయన మళ్లీ మవోయిస్టు ఉద్యమంలో కొనసాగారు. అప్పటి నుంచి అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. దండకారణ్యంలో విప్లవ పాఠాలు బోధిస్తున్నారు. 
 
కాగా, మరణ వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. మోహనరావు మృతి మవోయిస్టులకు తీరని లోటని… ఆయన భౌతిక కాయాన్నికుటుంబ సభ్యులకు అందించలేకపోయినందుకు చింతిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments