Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ కన్నుమూత

Webdunia
మంగళవారం, 22 జూన్ 2021 (16:19 IST)
పోలీసులను గడగడలాడించిన మావోయిస్టు అగ్రనేతల్లో హరిభూషణ్ ఒకరు. ఈయన అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. హరిభూషణ్ అనారోగ్యంతో కన్నుమూసినట్టు పోలీసు వర్గాల కథనం. ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. 
 
హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మర్రిగూడ గ్రామం. ఆయన అసలు పేరు యాపా నారాయణ. కాగా, హరిభూషణ్ మృతిపై పోలీసులు మంగళవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
 
ఏజెన్సీ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడి ఉంటారని ఇటీవల పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రాజేశ్, ఇడుమా, వినోద్ వంటి మావోలు కరోనాతో బాధపడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మావోలు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల ప్రకటించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments