Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచిర్యాలలో అంబులెన్స్ మాఫియా : రూ.80 వేలు అద్దె డిమాండ్

Webdunia
ఆదివారం, 1 మే 2022 (11:38 IST)
తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతుంది. మొన్నటికిమొన్న ఏపీలోని తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా ఓ వ్యక్తి కన్నబిడ్డ శవాన్ని ఏకంగా 90 కిలోమీటర్ల దూరం బైకులో తీసుకెళ్లాడు. తాజాగా తెలంగాణాలోని మంచిర్యాలలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. 
 
ఆస్పత్రిలో చనిపోయిన మృతదేహాన్ని మంచిర్యాల నుంచి ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు రూ.80 వేలు డిమాండ్ చేశారు. దీంతో ఓ వ్యక్తి సోదరుడి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలో వదిలేసి వెళ్లిన ఘటన హృదయ విదారకంగా మారింది. 
 
ఈ ఘటన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతులను ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోతీషాగా గుర్తించారు, వడదెబ్బ కారణంగా ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించారు.
 
మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి తరలించేందుకు అతని సోదరుడు ప్రైవేట్ అంబులెన్స్‌లను సంప్రదించగా వారు రూ.80,000 డిమాండ్ చేసినట్లు తెలిసింది. 
 
అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రిలో వదిలి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ మృతదేహాన్ని ఇతర రాష్ట్రాలకు తరలించే వెసులుబాటు తమకు లేదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు అంటూ వర్జిన్ బాయ్స్ టీమ్ ప్రకటన

వార్ 2 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్‌తో చేతులు కలిపిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా చిత్రం పేరు ఓం శాంతి శాంతి శాంతిః

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments