Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వద్దన్నా వినలేదు.. పారకర్రతో తలపై బాదాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:20 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం వారి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
 
గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. సువర్ణ అక్కడ ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండటంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు రాజు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ నేపథ్యంలోనే బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు పారకర్రతో తలపై బాదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments