భార్య వద్దన్నా వినలేదు.. పారకర్రతో తలపై బాదాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:20 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం వారి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
 
గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. సువర్ణ అక్కడ ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండటంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు రాజు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ నేపథ్యంలోనే బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు పారకర్రతో తలపై బాదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish: అల్లు కుటుంబానికి మార్చి 6న కలిసి వచ్చే కాలంగా మారింది

Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్

Revanth Reddy: ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

ఇతరుల బాధలో కూడా వినోదం వెతికేవారిని నిలదీసే రోజు రావాలి : అనసూయ

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments