Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం... అశ్వరథ ఊరేగింపు...

ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు.

Webdunia
శనివారం, 21 జులై 2018 (12:57 IST)
ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం తీసుకుంటున్న అధికారులను పట్టించిన ముగ్గురు వ్యక్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. అశ్వరథంపై కూర్చోబెట్టి.. మెడలో పూలదండలు వేసి... ఊరంతా ఊరేగించారు. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన ఆ ముగ్గురికి జరిగిన సన్మానం వివరాలను స్పందించారు.
 
మహబూబాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌, నర్సంపేటకు చెందిన జడల వెంకటేశ్వర్లు, భూపాల్‌పల్లి జిల్లా జంగేడుకు చెందిన పాలిక రఘుచారి ఈ ముగ్గురు వివిధ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగారు. 
 
ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీరి ద్వారా ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అవినీతి అధికారులను పట్టించిన నిజాయితీపరులుగా వీరిని ఈ విధంగా ఘనంగా సత్కరించింది జ్వాల స్వచ్చంధ సంస్థ. 
 
ఈ ముగ్గురినీ జూలై 20వ తేదీ శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో గుర్రపు బండీ ఎక్కించి ఊరేగించారు. సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కూడా హాజరై.. ఒక్కొక్కరికీ రూ.15వేలు నగదు బహుమతి అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments