Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి బిల్డింగ్ పై నుంచి తోసి చంపిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (13:42 IST)
హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రియురాలిని నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందకు నెట్టాడు ఓ ప్రియుడు. ఆమెను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందింది. ప్రియుడు దిలీప్ మాత్రం పరారయ్యాడు.
 
బ్రతుకుదెరువు కోసం 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు ఇరువురు వనస్థలిపురం శక్తినగర్ లోని వాసవి నిలయం భవనం నిర్మాణాల పనిలో చేరారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తోటి పనివారితో చెపుతూ ఉండేవారు. 
 
మరి ఇంతలో ఏమయిందో ఏమో నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్టుమెంట్ 3వ అంతస్తుపై నుంచి కిందకు ప్రియురాలు సీమను కొట్టి నెట్టేశాడు దిలీప్. అయితే అసలు ఆమెను ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయం మాత్రం అంతుపట్టకుండా ఉంది. దిలీప్ పోలీసులకు  దొరికితే తప్ప ఈ విషయం తెలీదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments