Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి బిల్డింగ్ పై నుంచి తోసి చంపిన ప్రియుడు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (13:42 IST)
హైదరాబాద్‌ వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రియురాలిని నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందకు నెట్టాడు ఓ ప్రియుడు. ఆమెను చికిత్స కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందింది. ప్రియుడు దిలీప్ మాత్రం పరారయ్యాడు.
 
బ్రతుకుదెరువు కోసం 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు ఇరువురు వనస్థలిపురం శక్తినగర్ లోని వాసవి నిలయం భవనం నిర్మాణాల పనిలో చేరారు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తోటి పనివారితో చెపుతూ ఉండేవారు. 
 
మరి ఇంతలో ఏమయిందో ఏమో నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్టుమెంట్ 3వ అంతస్తుపై నుంచి కిందకు ప్రియురాలు సీమను కొట్టి నెట్టేశాడు దిలీప్. అయితే అసలు ఆమెను ఎందుకు చంపాలనుకున్నాడు అనే విషయం మాత్రం అంతుపట్టకుండా ఉంది. దిలీప్ పోలీసులకు  దొరికితే తప్ప ఈ విషయం తెలీదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments