Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్ జిల్లాలో ఒకే కొమ్మకు ఉరేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:12 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రేమ జంట చెట్టు ఒకే కొమ్మకు ఉరేసుకున్నారు. ఎంతోకాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట.. ఏం కష్టమొచ్చిందో ఏమోగానీ... ప్రేమికులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఓ యువతీ యువకుడి మృతదేహాలు వేలాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. వారిద్దరూ ఒకే కొమ్మకు ఉరేసుకుని వుండటం చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే పోలీసులు స్థానికులతో కలిసివచ్చి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను కిందికి దించారు. ఆ తర్వా పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఈ ప్రేమ జంట వివరాలు తెలిశాయి. 
 
ఈ మృతులను మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన మోహన్, లక్ష్మిలుగా గుర్తించారు. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడివుంటారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, వీరిద్దరూ వారం రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments