Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో దారుణం : క్లీనర్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (14:46 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ లారీ డ్రైవర్ అత్యత కిరాతకంగా ప్రవర్తించాడు. లారీ క్లీనర్‌ను లారీ డ్రైవర్ ఇనుపరాడ్‌తో కొట్టడమే కాకుండా కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం తన లారీలో ఆ మృతదేహాన్ని వేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన  ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీలో పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్లీనర్‌ రాజును డ్రైవర్ నైఫ్‌రాజు రాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. 
 
ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఈ విషయం తెలిపాడు. హత్య చేసి ఆ మృతదేహాన్ని లారీలోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. 
 
గొడవపడిన క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికే క్లీనర్‌ను హత్య చేశానని డ్రైవర్ అంటున్నాడు. కత్తితో తనను హత్య చేయాలని క్లీనర్ చూడడంతో తానే పొడిచేశానని చెప్పాడు. దీనిపై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments