Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు ప్రకటన లేకుండా ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (10:58 IST)
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలను ఆ సంస్థ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రద్దు చేసింది. దీంతో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు విమానాశ్రయానికి వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాలు రద్దు చేస్తే ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ వారు ఎయిరిండియా అధికారులను నిలదీశారు. 
 
ఈ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి, బెంగుళూరు, మైసూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఎయిరిండియా సంస్థ విమాన సర్వీసులను నడుపుతుంది. అయితే, ఆ సంస్థ సోమవారం ఉన్నట్టుండి ఈ ప్రాంతాలకు సర్వీసులను రద్దు చేసింది. సాంకేతిక కారణాలతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన యాజమాన్యం.. టికెట్‌ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్‌ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments