Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ప్రారంభం

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (09:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఈ పెంచిన చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల రిజిస్ట్రేషన్, వినియోగ చార్జీలు, ఆ శాఖ అందించే ఇతర సేవల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఈ పెంచిన చార్జీలు సెప్టెంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 
 
ఈ మేరకు బుధవారం కూడా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ.500గా ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీ తాజా పెంపు కారణంగా రూ.2 వేలకు పెరగ్గా, సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగుకు ఉన్న రూ.300 ఫీజును 1000 రూపాయలకు పెంచింది.
 
అగ్రిమెంట్ ఆఫ్ సేల్, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా దానిని కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా రూ. లక్ష రూపాయలకు పెంచింది. వీటితోపాటు ఇతర చార్జీలను పెంచిన ప్రభుత్వం సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకుంటే రూ.5 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. 
 
అలాగే, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులంటే ఎవరో కూడా వివరించింది. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం.. తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అవ్వ, మనవలు, దత్తత తీసుకున్న కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రిగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments