Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరో నాలుగు మండలాలకు దళిత బంధు విస్తరణ...

Advertiesment
Dalit Bandhu Scheme
, బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:08 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని మరో నాలుగు మండలాలకు విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని 4 మండలాల్లో దళితబంధు అమలు చేయాలని అధికారులకు సూచించింది. 
 
రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి... ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్​తో పాటే దళితబంధు అమలు చేయనున్నారు. 
 
ఇప్పటికే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళితబంధు అమలు అవుతుండగా... ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని చారగొండ మండలంలో, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అమలు చేయాలని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగం డెయిరీ కేసు : సర్కారుకు మరోమారు మొట్టిక్కాయ