Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో భూముల ధరలకు రెక్కలు.. పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజులు

Webdunia
గురువారం, 22 జులై 2021 (08:15 IST)
తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది. ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అదేసమయంలో పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ రుసుములు కూడా పెంచింది. ఇవన్నీ గురువారం నుంచి అమల్లోకిరానున్నాయి. 
 
కాగా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల విలువను మొత్తం మూడు శ్లాబులుగా విభజించింది. అయితే రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. 
 
ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పు చేర్పులు చేశారు.
 
భూముల విలువ తక్కువగా ఉన్న చోట 50 శాతం, మధ్యస్తంగా ఉన్న ప్రాంతాల్లో 40 శాతం, ఎక్కువగా ఉన్న చోట మాత్రం 30 శాతం ధరలు పెంచింది. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. కొత్త ధరలకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ధరణి పోర్టల్‌లో కూడా మార్పులు చేసేశారు. 
 
ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా కొత్త చార్జీల ప్రకారమే చెల్లింపులు చేసి… రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నారు. వీరంతా అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్‌లోనూ మార్పులు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments