Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్‌ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారట.. పేలిన కేటీఆర్ ట్వీట్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (09:09 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఈ వైరస్ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ 50 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. ఎంతో జాగ్రత్తగా ఉండే పలువురు రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు సైతం ఈ వైరస్ కోరల్లో చిక్కుకుంటున్నారు. 
 
అయితే, నిత్యం ప్రజల్లో ఉంటూ, వారితో మాట్లాడుతూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఉండే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ఈ వైరస్ సోకలేదు. ఇదే అంశంపై ఓ నెటిజన్ ఓ ప్రశ్న సంధించాడు. దీనికి మంత్రి తనదైనశైలిలో ఆ నెటిజన్‌కు సమాధానమిస్తూనే, బీజేపీపై సెటైర్ వేశారు. 
 
ఇంతకీ ఆ నెటిజన్ ఏమని అడిగారంటే... 'కేటీఆర్ సర్. మీరు ఇటీవల హైదాబాద్ నగరంలోని భారత్ బయోటెక్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఆ సమయాంలో కరోనా టీకాను తీసుకున్నారా? ఈ ప్రశ్నను నేను ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, మీరు ప్రజల్లో ఎంతగా తిరుగుతూ ఉన్నా, మీకు ఏమీ కాలేదు. దీనికి కారణం మరేమైనా ఉందా?' అని ప్రశ్నించారు. 
 
దీనికి మంత్రి కేటీఆర్ కూడా తనదైనశైలిలో బదులిచ్చారు. "అటువంటిది ఏమీ లేదు. నేనేమీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోలేదు. వ్యాక్సిన్‌ను బీహార్ కోసమే రిజర్వ్ చేశారట" అని అంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
దీనికి కారణం.. బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బీజేపీ గురువారం ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో తాము అధికారంలోకి వస్తే బీహార్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తామని ప్రధానంగా ప్రస్తావించింది. ఈ హామిపైనే మంత్రి కేటీఆర్ సెటైరికల్‌గా బదులిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments