Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనాధగా మిగిలిపోయిన బాలికను ఆదుకున్న మంత్రి కేటీఆర్

అనాధగా మిగిలిపోయిన బాలికను ఆదుకున్న మంత్రి కేటీఆర్
, బుధవారం, 21 అక్టోబరు 2020 (15:45 IST)
ఒకేసారి తల్లి దండ్రులతో పాటు తన తోడపుట్టిన సోదరుడిని కోల్పోయి ఓ పన్నెండేళ్ల బాలిక అనాథగా మిగిలింది. ఏ దిక్కు లేకుండా ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తుంది. ఆ బాలిక విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ట్విట్టర్ ద్వారా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఆదేశించారు.
 
మంత్రి ఆదేశాల మేరకు ఆ బాలిక గురించిన స్థితిగతులను తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సుభద్రకు ఆదేశాలు జారీచేశారు. వెంటనే అక్కడి గ్రామానికి చేరుకొని బాలికను పరామర్శించిన అనంతరం చిర్డ్రన్ వెల్పేర్ సెంటర్‌కు తరలిస్తామన్నారు.
 
తక్షణ సాయంగా ఆ బాలికకు రూ.30 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇతర వసతుల ఏర్పాట్లకై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అప్పటివరకు బంధువులు, గ్రామస్తులు బాలికకు అండగా ఉండాలని కోరారు. ఆమె వెంటనే సీడీపీఓ కవిత, ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్ జ్యోతి ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఆ' సుఖానికి నిరాకరించింది.. అందుకే స్నేహితులతో కలిసిచంపేశా...