Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు నేడు పట్టాభిషేకం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందిన మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పట్టాభిషేకం జరుగనుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నాయి. ఈ పట్టాభిషేక కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక బసవతారకం ఆస్పత్రి నుంచి కేటీఆర్ ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
 
అనంతరం 11.56 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments