Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు నేడు పట్టాభిషేకం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (09:25 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందిన మాజీ మంత్రి కేటీఆర్‌కు సోమవారం పట్టాభిషేకం జరుగనుంది. ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి తెరాస శ్రేణులు పెద్దఎత్తున హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నాయి. ఈ పట్టాభిషేక కార్యక్రమం పార్టీ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు స్థానిక బసవతారకం ఆస్పత్రి నుంచి కేటీఆర్ ర్యాలీగా బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. 
 
అనంతరం 11.56 గంటలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడుతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments