Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కేటీర్ దర్శనం వివాదాస్పదం, ఆయన గుడిలోకి ఎలా వెళ్లారో చెప్పాలంటూ

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (20:54 IST)
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువులు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రలు ఎమ్మెల్యేలు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు. అయితే  ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుమలకు విఐపిల తాకిడి ఎక్కువ అయింది. ఇందులో భాగంగా స్వామిని దర్శించుకోవడాని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్, భార్య శైలిమి, కుమార్తెతో సహా వచ్చారు. 
 
అయితే నిబంధనలకు విరుద్ధంగా కేటిఆర్‌ని బయోమెట్రిక్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి అనుమతించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను కంపార్టుమెంట్లలో వేచివుండేలా చేసి కేటిఆర్‌ని మాత్రం ముందుగానే ఆలయంలోకి ఎలా తీసుకువెళతారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి. 
 
సోమవారం వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలను బహిర్గతం చెయ్యాలని, సిసి టివి ఫుటేజిని మీడియాకు విడుదల చెసి భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాను ప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కాపాడవలసిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుందని, అంతేగాని నచ్చిన వారి కోసం నిబంధనలు మార్చడం మహాపాపం అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. గతంలో భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి బోర్డు మెంబరుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments