Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం బ్రిడ్జి విరిగిపోయిందా.. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లా?: కేటీఆర్

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:01 IST)
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించేందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి బ్రిడ్జి విరిగిపోతుందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాళ్లు ఎక్స్‌పర్ట్ ఇంజనీర్లలా మాట్లాడతారు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 
 
ఈ ఇద్దరు నాయకులు వంతెన విస్తరణ జాయింట్‌లను చూపుతున్నారని, వంతెన కూలిపోతుందని చెప్పడం ద్వారా ప్రజల్లో భయాన్ని పెంచుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని రేవంత్ రెడ్డితో కలిసి సందర్శించిన అనంతరం బీఆర్‌ఎస్ అధినేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
 
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతల ఆరోపణపై.. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు వెచ్చించినప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు వరం అని, కాంగ్రెస్‌ పార్టీ దేశ ప్రజలకు శాపమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments