Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లిగుడిసెలు బస్తీలో పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:00 IST)
హైదరాబాద్ నగరంలోని మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా డబుల్ బెడ్రూమ్ గృహాలను నిర్మించింది. మొత్తం 288 డ‌బుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిచగా, ఈ గృహాలను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. ఈ గృహాలను తొమ్మిది బహుళ అంతస్తుల్లో నిర్మించారు. ఇందుకోసం మొత్తం రూ.24.91 కోట్లను ఖర్చు చేశారు. 
 
హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. ఆ ప్రాంతానికి కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కాల‌నీలో కొత్త‌గా సీసీ రోడ్లు వేశారు. తాగునీటి అవ‌స‌రాల కోసం 100 కేఎల్ సామ‌ర్థ్యంతో సంప్‌ను నిర్మించారు. 19 షాపుల‌ను ఏర్పాటు చేశారు.
 
డ‌బుల్ బెడ్రూం గృహాల ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, మ‌హ‌ముద్ అలీ, ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీతో పాటు ప‌లువురు పాల్గొన‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments