మునుగోడులో తెరాసది అధర్మ విజయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (16:52 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస విజయం దిశగా దూసుకెళుతుంది. దీనిపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇది తెరాకు దక్కిన అధర్మ విజయమన్నారు. ఇక్కడ తాము నైతికంగా విజయం సాధించామన్నారు. 
 
తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికారులను సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను తెరాస సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుందని ఆయన అన్నారు. కనీంస తమను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస జోరు ప్రదర్శిస్తుంది., 12వ రౌండ్‌లో తెరాసకు 2042 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసే సరికి గులాబీ పార్టీ ఆధిక్యం 7807 ఓట్లకు పెరిగింది. ఇప్పటివరకు 82005, బీజేపీకి 74198, కాంగ్రెస్‌ పార్టీకి 17627 ఓట్లు లభించాయి. మరో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సివుంది. అయినప్పటికీ తెరాస విజయం ఇక లాంఛనప్రాయంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అభిమానం ఉన్నంతవరకు నన్ను ఎవరూ ఏమీ చేయలేరు : మంచు మనోజ్

Prabhas: రాజా సాబ్ నుంచి సహన సహన..సింగిల్ రిలీజ్ - సంక్రాంతిసందడి కి రెడీగా వుండండి

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments