మునుగోడులో తెరాసది అధర్మ విజయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (16:52 IST)
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస విజయం దిశగా దూసుకెళుతుంది. దీనిపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇది తెరాకు దక్కిన అధర్మ విజయమన్నారు. ఇక్కడ తాము నైతికంగా విజయం సాధించామన్నారు. 
 
తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అధికారులను సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రభావితం చేశారని ఆయన ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను తెరాస సొంత పార్టీ ప్రయోజనాలకు వాడుకుందని ఆయన అన్నారు. కనీంస తమను ప్రచారం కూడా చేసుకోనివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. 
 
ఇదిలావుంటే మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 12 రౌండ్లు పూర్తయ్యే సరికి తెరాస జోరు ప్రదర్శిస్తుంది., 12వ రౌండ్‌లో తెరాసకు 2042 ఓట్ల ఆధిక్యం లభించింది. 12 రౌండ్లు ముగిసే సరికి గులాబీ పార్టీ ఆధిక్యం 7807 ఓట్లకు పెరిగింది. ఇప్పటివరకు 82005, బీజేపీకి 74198, కాంగ్రెస్‌ పార్టీకి 17627 ఓట్లు లభించాయి. మరో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సివుంది. అయినప్పటికీ తెరాస విజయం ఇక లాంఛనప్రాయంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments