Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ముద్దు పెట్టించుకున్న వధువు.. ఠాణాలో వదిలేసివెళ్లిన భర్త

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:52 IST)
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హుజూరాబాద్‌కు చెందిన యువతికి మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో సోమవారం రాత్రి వివాహం జరిగింది. వధువు హుజురాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రుల మాట కాదనకుండా పెళ్లికి  అంగీకరించింది. 
 
ఇది తెలిసిన వంశీ సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలు, ప్రేమలేఖలను వరుడికి పంపించి పెళ్లి చేసుకోవద్దని బెదిరించాడు. అయితే వాటిని పట్టించుకోకుండా వధూవరుల తల్లిదండ్రులు వీరి వివాహం జరిపించారు. ఈ క్రమంలో బరాత్‌ ముగిసిన వెంటనే సోమవారం రాత్రి వాహనంలో వరుడి ఇంటికి వెళ్తున్నారు. 
 
ప్రియురాలి సమాచారంతో వంశీ జమ్మికుంట రోడ్డులో వాహనాన్ని అడ్డగించి వరుడి ఎదురుగానే ముద్దుపెట్టుకొని ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని గొడవకు దిగాడు. దీంతో వరుడి తరపు బంధువులు అదే రాత్రి పోలీసులను ఆశ్రయించారు. అర్థరాత్రి వరకు కౌన్సెలింగ్‌ చేసిన ఇరువర్గాల వారు వినకపోవడంతో వరుడు.. వధువును పోలీసుస్టేషన్‌లోనే వదిలేసి మందమర్రికి వెళ్లిపోయాడు. 
 
ఇటు వధువు తల్లిదండ్రులు సైతం ఆమెను ఠాణాలోనే వదిలి వెళ్లారు. పోలీసులు సదరు వధువును కరీంనగర్‌లోని స్వధార్‌ హోంకు తరలించారు. ముద్దు పెట్టుకొని వివాదానికి కారణమైన వంశీపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments