Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ జూలో కిరణ్ మృతి.. ఎవరీ కిరణ్?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (12:09 IST)
హైద‌రాబాద్‌లోని జ‌వ‌హర్లాల్ నెహ్రూ జువాల‌జిక‌ల్ పార్కులో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెల్ల‌రంగు రాయల్‌ బెంగాల్ టైగ‌ర్ కిర‌ణ్ మృతిచెందింది. 
 
ఎనిమిదేండ్ల కిర‌ణ్ కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్‌ కణితి కార‌ణంగా అనారోగ్యం పాలైంద‌ని, గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఇప్పుడు మ‌ర‌ణించింద‌ని జూ అధికారులు తెలిపారు. కిర‌ణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగింద‌ని వారు వెల్ల‌డించారు. 
 
గ‌త నెల 29న ప‌రీక్ష‌లు చేయ‌గా కిర‌ణ్ కుడి ద‌వ‌డ‌లో క‌ణితి ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పారు. అప్ప‌టి నుంచి శాస్త్ర‌వేత్త‌‌లు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు. 
 
మృతి చెందిన పులికి వెటర్నరీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ‌హించారు. కిరణ్‌ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్‌ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిర‌ణ్‌ తాత రుద్ర 12 ఏండ్ల‌ వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments