తెలంగాణ సీఎం ఇంట్లో తాచుపాము... పట్టుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (11:18 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇంట్లోకి నల్ల తాచు పాము వచ్చింది. దీంతో ఆయన వణికిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడకు వెళ్లి చాకచక్యంగా పట్టుకున్నారు. 
 
గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అనేక మంది అధికారులు నివసిస్తున్నారు. అయితే, ఈ ఏరియాలో చెట్లు, చిన్నచిన్న నీటికుంటలు, గుట్టలు అధికంగా ఉండటంతో విషసర్పాలు తరచుగా కనిపిస్తున్నాయి. 
 
ఈ క్రమంలో గురువారం చీకటి పడిన తర్వాత సీఎస్ ఎస్కే జోషి ఇంటి వెనుకభాగంలో ఓ నల్లతాచు పాము వచ్చి పడగ విప్పి బుసలు కొట్టసాగింది. దీన్ని చూసిన జోషి కుటుంబ సభ్యులతో పాటు.. స్థానికులు భయంతో వణికిపోయారు. ఈలోగా విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది అక్కడుక వెళ్లి.. తన వద్ద ఉన్న ఓ పరికరంతో దాన్ని బంధించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా దూరంగా వదిలిపెట్టాల్సిందిగా పోలీసులను కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments