Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారూ.. కారుణ్య మరణం ప్రసాదించండి... పదేళ్ళ బాలుడు వినతి

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (18:40 IST)
హృదయాన్ని ఇట్టే కదిలించే ఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో జరిగింది. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని పదేళ్ళ బాలుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రాధేయపడ్డాడు. తన అక్క, బావల వేధింపులు భరించలేక పోతున్నానని, అందువల్ల మెర్సీ కిల్లింగ్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సాయి అనే బాలుడు సీఎం కేసీఆర్‌ను ఓ విజ్ఞప్తి చేశాడు. తన తండ్రి గోరింట్ల లక్ష్మీనారాయణ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందాడని, ఆ తర్వాత తల్లిని పాఠశాలలో అటెండర్‌గా నియమించారన్నారు.
 
కరోనా పేరుతో తన తల్లిని తన సోదరి, బావ చంపారని, అప్పటి నుంచి తన వద్ద ఉన్న డబ్బు, తల్లి ఉద్యోగం తన సోదరికి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, అయితే తన సోదరి, బావ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. వారిద్దరి వేధింపులు భరించలేక పోతున్నానని, అందవుల్ల తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని ప్రాధేయపడ్డాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments