ఖమ్మంలో ఘరానా మోసం .. రూ.3.50 కోట్లకు కుచ్చుటోపి

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి పాల్పడింది కూడా ఒక కుటుంబమే. తమ చుట్టుపక్కల వారిని నమ్మంచి ఏకంగా రూ.3.50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టి పత్తాలేకుండా పారిపోయారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు మోసగాళ్లను అరెస్టు చేయగా, కీలక మహిళా సూత్రధారి మాత్రం పారిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన పురాణం శివకుమారి ముగ్గురు కుమారులతో కలిసి ఖమ్మంలో నివసిస్తోంది. జిల్లాలోని కొన్ని సంస్థలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నట్టు చెప్పుకునేది. 
 
ఈ క్రమంలో వ్యాపారుల నుంచి కోట్ల రూపాయల విలువైన పెసలు, కందిపప్పు, బియ్యం తదితరాలను తీసుకునేది. అలాగే, నాలుగు రూపాయల వడ్డీ ఇస్తానని ఆశ చూపి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసింది.
 
వ్యాపారులను నమ్మించేందుకు తొలుత కొంత డబ్బులు చెల్లించేది. ఆ తర్వాత రేపు, మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రూ.70 లక్షలు ఇచ్చిన ఖమ్మం రూరల్ మండలానికి చెందిన మాలోతు సునీత మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలి కుమారులైన పురాణం శివ, పురాణం శంకర్‌లను ఆదివారం అరెస్టు చేశారు. కీలక నిందితురాలైన పురాణం శివకుమారి, పురాణం గోపీకృష్ణ పరారీలో ఉన్నారు. వీరిపై మొత్తం ఏడు చీటింగ్ కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments