Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ భవనంలా కేసీఆర్‌ బడి

Webdunia
శనివారం, 3 జులై 2021 (10:17 IST)
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదువుకున్న బడిని రాజ భవనంలా తీర్చిదిద్దారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. పాఠశాల నుంచి జూనియర్‌ కాలేజీ వరకు ఒకేచోట ఉండేలా నిర్మించారు. దుబ్బాక పాఠశాలలో కేసీఆర్‌ ప్రాథమిక విద్య నుంచి 9వ తరగతి దాకా చదివారు.

సీఎం అయిన తర్వాత నూతన భవన నిర్మాణానికి తొలుత రూ.6 కోట్లు కేటాయించారు. తర్వాత నిధులను పెంచారు. ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల ఒకేచోట ఉండాలనే సంకల్పంతో 18,787 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తులతో నిర్మించారు. పాఠశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ప్రయోగశాలలు, ఒక ఆర్ట్స్‌ గది, కామన్‌ గది, ఒక స్టోర్‌ రూం, ప్రధానోపాధ్యాయుడి గది, మూడు సిబ్బంది గదులు ఉన్నాయి.
 
జూనియర్‌ కళాశాల కోసం 14 తరగతి గదులు, నాలుగు ల్యాబ్‌లు, స్పోర్ట్స్‌ రూం, గ్రంథాలయం, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌ గది, రెండు సిబ్బంది గదులు, ఒక సమావేశ మందిరం ఉన్నాయి. 250 మంది ఒకేసారి వినియోగించుకునేలా బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు.

పాఠశాల, కళాశాలలకు విడివిడిగా నీటి ట్యాంకులున్నాయి. ప్రత్యేక విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. త్వరలోనే కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments